UPDATES  

 భవిష్యత్ సైంటిస్టులుగా విద్యార్థులు ఎదగాలి.. ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్.. వనదేవతలకు ప్రత్యేక పూజలు..

 

మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 10, భవిష్యత్ సైంటిస్టులుగా విద్యార్థులు ఎదగాలని రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ అన్నారు. మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలోని శుక్రవారం సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గీతం యూనివర్సిటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఘన స్వాగతం పలికారు. జీవన్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్ సైంటిస్టులుగా ఎదగాలంటే సైన్స్ పై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. గిరిజన పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు సైన్స్ పట్ల పూర్తి అవగాహన పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన వివిధ రకాల ప్రయోగాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ప్రదర్శనలకు, క్విజ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు నగదు, బొమ్మలతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గీతం యూనివర్సిటీ హైదరాబాద్ వారు ఆశ్రమ పాఠశాలకి సుమారు లక్ష రూపాయల విలువ గల రసాయన పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాంబాబు, ఏటిడబ్ల్యూఓ రూపాదేవి, ఎంఈఓ వెంకట్, హెచ్ఎం సుభద్ర, ఎంపీపీ సోనీ, జడ్పీటీసీ కళావతి,
సీఐ వసంత్ కుమార్, పొన్నెకంటి సతీష్ కుమార్, ఎల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !