మన్యం న్యూస్ వాజేడు.
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జిల్లాల ఆధ్వర్యంలో శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల సాక్షిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, వెంకటాపురం గ్రామంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్లో వాజేడు మండలం మొరుమూరు గ్రామం వాలీబాల్ జట్టు 20వేల రూపాయలు, మొదటి బహుమతి సాధించారు. మొరుమూరు జట్టు నర్సాపూర్ టీమితో తలపడి హోరాహోరీగా జరిగిన ఆటలో మురుమూరు టీముకు ప్రధమ బహుమతి సాధించినట్లు కోచ్ బాలకృష్ణ తెలిపారు.