UPDATES  

 తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోండి

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10.. తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుపాటు నిర్వహిస్తున్న జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరావు తెలిపారు. శుక్రవారం శిక్షణా తరగతులు నిర్వహణపై పట్టణంలోని పి.ఆర్ ఫంక్షన్ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో
కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో ఈనెల 11, 12 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతుల గురించి వివరించారు.
జర్నలిస్టుల శిక్షణ, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ మీడియా అకాడమీ పనిచేస్తుందని, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం, పెన్షన్లు, చదువుకుంటున్న పిల్లలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాలను చేపడుతూ అన్ని రకాలుగా మీడియా అకాడమీ ఆదుకుంటుందని వివరించారు.
ఇప్పటివరకు పాత 10 జిల్లాల్లో శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా, హైదరాబాదులో రాష్ట్రస్థాయిలో మహిళా జర్నలిస్టులకు ఉర్దూ జర్నలిస్టులకు,దళిత జర్నలిస్టులకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులను నిర్వహించామని వివరించారు.
పాత పది జిల్లాల్లో జర్నలిస్టుల శిక్షణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులను నిర్వహించాలని అందుకు మొట్టమొదటిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఎంపిక చేసిన నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో ఫిబ్రవరి 11, 12 తేదీలలో రెండు రోజులపాటు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10.30కు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు విశిష్ట అతిధులుగా విచ్చేస్తున్నారని, సీనియర్ జర్నలిస్టులచే శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, సోషల్ మీడియా ధోరణులు, గ్రామీణ వార్తలు, మీడియాలో నైతిక ద్వారములు అనే అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాబట్టి, జిల్లాలోని ప్రతి ఒక్క జర్నలిస్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో
మీడియా అకాడమీ మేనేజర్ వెంకటేష్, మీడియా అకాడమీ చైర్మెన్ ఓఎస్డీ రహమాన్,
డి పి ఆర్ ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !