మనం న్యూస్ వాజేడు. ఫిబ్రవరి 10 మండలంలో జగన్నాధపురం గ్రామం పరిధిలో 163 జాతీయ రహదారి పైన ఎస్సై తిరుపతి రావు ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.వెళ్లే వాహనాలను తనిఖీలో భాగంగా వాహనదారుల నుంచి లైసెన్సులు, బండి పేపర్లు, వాహనాలలో అనుమానితులుగా కనబడితే వారి వివరాలు సేకరించారు. వాహనాలలో ప్రయాణికులు పరిమితంగా ఉండాలని వాహనదారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు.
