UPDATES  

 సేవలందించిన వారిని నిర్వాసితులను చేస్తారా కూల్చివేత నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం వెనక్కు తీసుకోవాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10..సుధీర్గ కాలంపాటు సింగరేణి సంస్థకు సేవలందించి పదవి విరమణ పొందిన మాజీ కార్మికులను, సంస్థపై పరోక్షంగా ఆధారపడిన పెదలను నిర్వాసితులను చేయడం సింగరేణి యాజమాన్యానికి తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. పట్టణంలోని బర్మా క్యాoపు ఏరియాలో మాజీ కార్మికులు, ఇతర నిరుపేదను నివాసముంటున్న క్వార్టార్లను, ఇదే ఏరియాలో సొంతగా నిర్మించుకున్న ఇండ్లను సింగరేణి యాజమాన్యం కూల్చివేతకు పూనుకోవడంపై అయన స్పందిస్తూ శుక్రవారం స్థానిక శేషగిరిభవన్ నందు అయన మాట్లాడారు. సింగరేణి పుట్టుక నాటినుంచి సంస్థలో పనిచేసిన వందలాది మంది మాజీ కార్మికులు, సంస్థపై పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు, మాజీ కార్మికుల వారసులు బర్మా క్యాంపు ప్రాంతంలో నివసిసుతున్నారని, ఈ ప్రాంతంపై మక్కువ పెంచుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్లలేక సంస్థ నిర్మించిన క్వార్టర్లలో నివసిస్తున్నారని, ఇదే ప్రాంతంలో కొందరు ఇండ్లు నిర్మించుకో నివసిస్తున్నారని, వీరిని ఖాళీ చేయించే చర్యలకు యాజమాన్యం పూనుకుందన్నారు. ఈ క్వార్టర్లు, బర్మా క్యాంపు స్థలాలను సింగరేణి సంస్థకు అవసరంలేనప్పటికీ కక్ష్య సాధింపుగా క్యార్టార్లను, ఈ ప్రాంతంలోని పేదల స్థిర నివాసాలను కూల్చివేతను నిలుపుదల చేయాలనీ, లేని పక్షంలో బాధితులను సమీకరించి సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !