మన్యం న్యూస్ చండ్రుగొండ,ఫిబ్రవరి10 : మండల పరిధిలోని రావికంపాడు గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి అయిదుగురు వ్యక్తులపు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి శుక్రవారం తెలిపాడు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా అయిదుగురు వ్యక్తులతో పాటు, వారి నుంచి రూ.3వేలు నగదు, స్వాధీన పర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామాల్లో పేకాట, కోడిపండేలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.