మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 10.. బడిని విడిచి పనులకు వెళుతున్న బాల కార్మికులను చేరదీసి వారిని సమీప పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విచక్షణను కోల్పోయారు. సేయింగ్ ఆ పాట చాలలో చదువుతున్న విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు. పంతుల ద్విచక్ర వాహనాలను నీళ్లతో కడగడం, పాఠశాలను శుభ్రంగా ఓడవడం మొక్కలకు నీళ్లు పట్టడం ఇక్కడ దినచర్యగా మారిపోయింది . వీరి విద్యార్థులా లేక బాల కార్మికుల అనే సందేహం కలుగక మానదు. ఇది కరకగూడెం మండలం బట్టుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నిత్యం జరుగుతున్న తంతు. సాయంత్రం సమయంలో విద్యార్థులకు వ్యాయామం క్రీడలు నేర్పించవలసిన సమయంలో పిల్లలతో చెట్లకు పాఠశాల ఆవరణలో ఉన్న టైల్స్ కు ఉపాధ్యాయుల ద్విచక్ర వాహనాలకు నీళ్లు పట్టిస్తున్నారు. అటుగా వెళ్లిన విలేకరులు ఫోటోలు తీసుకొని ఈ విషయయం పై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వివరణ కోరితే పిల్లలు సరదాగా పనులు చేస్తుంటారు, పనులు చేపిస్తాం అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. ఈ విషయమే పాఠశాల విద్యార్థులను వివరణ అడగగా మా మేడం గారు మాతో ఇలానే పనులు చేపిస్తారని తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే ఇలా పనులు చేపిస్తే ఎలా అని వారి పిల్లల్ని కూడా ఇలా పనులు చేపిస్తే ఊరుకుంటారా అనే విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపై ఎంఈఓ,విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
