UPDATES  

 సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి… ఏఎస్సై క్రిష్ణరావు

మన్యం న్యూస్ చండ్రుగొండ, ఫిబ్రవరి10: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులను సైతం అప్రమత్తం చేయాలని ఏఎస్సై క్రిష్ణరావు అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అపరిచితలు ఎవరైనా పోన్ చేసి తమ ఆధార్ నెంబర్, బ్యాంకు అకౌంటు నెంబర్, ఓటిప్ నెంబర్లు చెప్పమని కోరితే అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండా లన్నారు. పోన్లో ఎటువంటి నెంబర్లు, ఓటిపిలు ఇతర వ్యక్తులకు చెప్పవద్దన్నారు. మన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు ఇతర వ్యక్తులకు పంపకూడదన్నారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది, ఉపాద్యాయులు, పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !