మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 10… పోడు వ్యవసాయం చేసుకుంటున్నా ప్రతి రైతుకు పోడుభూమి హక్కు పత్రాన్ని ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరకగూడెం తహసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన ప్రతి పత్రాన్ని ఆర్ఐ రాజుకి అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడుతూ మండలంలోని 16 గ్రామపంచాయతీ పరిధిలోని పోడు వ్యవసాయం చేసుకుంటున్న అందరికీ పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు దరఖాస్తులు పెట్టిన ప్రతి ఒక్కరికి పట్టాలి ఇవ్వాలని ఫారెస్ట్ అధికారుల స్వాధీనం చేసుకొని మొక్కలు నాటిన భూములను తక్షణమే రైతులకు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చర్ప.సత్యం,ఊకె. నరసింహారావు,శంకరయ్య,పుల్లయ్య,పాయం. నరేందర్,గొగ్గలి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.
