మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి10: ప్రతి ఒక్కరూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు సతీమణి సుధారాణి అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం లోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. క్రీడల వలన మంచి క్రమశిక్షణ విద్యార్థులకు అలవరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ ఛైర్మెన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యం బాబు, ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, వట్టం రాంబాబు, యూసఫ్ షరీఫ్, పోలెబోయిన అనీల్, లక్ష్మణ్, రవి, విక్రమ్, బోశెట్టి రవిప్రసాద్, బానోత్ రమేష్, గుర్రం సృజన్, కార్తిక్, నాగరాజు, శివశంకర్, రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
