UPDATES  

 11 కె.వి విద్యుత్ సరఫరాను వెంటనే మార్చాలి… -బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు నజీర్ సోను.

మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి10: అశ్వాపురం మండలంలోని అమెర్థ పంచాయితీలోని అమెర్థ కాలనీలో కొందరి ఇళ్ళ అంచును తాకుతూ ప్రమాద స్థాయిలో చేతికి అందేటట్లు 11 కె.వి విద్యుత్ సరఫరా జరుగుతుందని, వెంటనే 11 కె.వి విద్యుత్ సరఫరాను మార్చాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు నజీర్ సోను కోరారు. ఆయన శుక్రవారం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఈ కి అందజేశారు. అనంతరం నజీర్ సోను మాట్లాడుతూ గతంలో వైర్లు తెగిపడి ప్రమాద ఘటనలు జరిగాయని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జూపెల్లి కిరణ్, ఇరుగు నాగారాజు, మోదుగు వంశీ, మేకల భాస్కర్, నవీన్, ఎడ్మిజర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !