మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి10: మణుగూరు సింగరేణి ఏరియా పర్యటనకు వచ్చిన సింగరేణి డైరెక్టర్స్ ఎన్.బలరాం, యస్.వి.కె శ్రీనివాస్, జి.వెంకటేశ్వర రెడ్డి లను శుక్రవారం టీబీజీకేఎస్ఏ రియా బ్రాంచి నాయకులు స్థానిక జియం కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాత యం. సి క్వార్టర్స్ కు అదనపు పార్కింగ్ షెడ్స్ నిర్మాణం చేయాలని కోరారు. ఓ. సి 2 తరలింపు దృష్ట్యా నూతనంగా నిర్మిస్తున్న కనకదుర్గ అమ్మ వారి ఆలయం కు 50 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని, డాక్టర్ బి అర్ అంబేద్కర్ పార్క్ కు ఓపెన్ జిమ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సి. ఈ. అర్ క్లబ్ లో నూతన సామగ్రి కొనుగోలు కు మరో 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఏరియా హాస్పటల్ లో బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ అవకాశం లేకపోవడంతో ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏరియా హాస్పటల్ లో బ్లడ్ స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణాపాయ, అత్యవసర పరిస్థితుల్లో కంపెనీ హైద్రాబాద్ రిఫరల్ చేస్తోందని అక్కడ సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ హాస్పటల్ కు, సింగరేణియులకు అనుసంధాన కర్తగా భాధ్యత గల వ్యక్తినీ నియమించినప్పటికీ తను పూర్తి స్ధాయిలో సర్వీస్ అందించలేకపోతున్నాడని తన నిర్వాకం వల్ల అనేక మంది సేవలు అందక అవస్ధలు పడుతున్నారన్నారు. దీనిపై యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవుఫ్, బ్రాంచి నాయకులు వీర భద్రయ్య, కాపా శివాజి, బానోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
