UPDATES  

 మిర్చి కొనుగోలులో మోసగాడు. రైతులను నట్టేట ముంచిన కేటుగాడు

మిర్చి కొనుగోలులో మోసగాడు.
రైతులను నట్టేట ముంచిన కేటుగాడు
డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు జరుగుతున్న ప్రబుద్ధుడు
రైతుల చేతికి చిక్కిన ఘనుడు
డబ్బులు ఇస్తావా.. చస్తావా.. రైతాంగగ్రహం
విద్యుత్ స్తంభానికి కట్టేసి ఆవేదన వ్యక్తం చేసిన రైతులు….
సుజాతనగర్ ప్రధాన సెంటర్లో సంచలనం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి10… ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతు పంటను మాయ మాటలతో మింగేసిన మోసగాడు పండించిన పంటను నాకు ఇవ్వండి ఇట్టే పైసలు కొట్టేస్తాం అంటూ నమ్మబలికి పంటను చేదిక్కించుకొని పైసలు ఇవ్వకుండా అనుభవించు రాజా అంటూ విలాస జీవితాన్ని గడుపుతున్న ఓ ప్రబుద్ధుడు తతంగం ఇది. అసలే గిట్టుబాటు ధర లేక పీక లోతు అప్పులు కొట్టుమిట్టాడుతున్న రైతన్నలకు పంట చేతి కందిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ ఓ దళారి దర్జాగా మోసం చేసిన సంఘటన ఇది. పంటను చేజిక్కించుకొని పలాయనం చిత్తగించి పైసలు ఇవ్వకుండా తిరుగుతున్న ఆ ప్రబుద్ధున్ని రైతులే స్వయంగా పట్టుకున్నారు. ఏడాది గడిచిన రైతులకు ఇవ్వాల్సిన పంట డబ్బులు ఇవ్వకుండా సాకులు చూపెడుతూ సరదా సంబరాలుతో మునిగి తేలుతున్న ఈ మోసగాడుని విద్యుత్ స్తంభానికి కట్టేసి అందరూ చూస్తుండగా డబ్బులు కోసం నిరసన వ్యక్తం చేసిన రైతుల కన్నీటి వేద శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల నడిబొడ్డున రైతులను మోసగిస్తున్న కేటుగాడిని విద్యుత్ స్తంభానికి కట్టేసి డబ్బులు ఇస్తావా చస్తావా అంటూ హెచ్చరించిన సంఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల్లోకెళితే… జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య శివమణి అనే దళారి సుజాతనగర్ ప్రాంతంలోని ఉన్నటువంటి రైతులు ఇస్లావత్ రాజు, గుగులోతు రమ, భూక్య నాగలకు మూడేళ్ల క్రితం వారు పండించిన మిర్చి పంటను ఎక్కువ డబ్బులకు ఆశ చూపి ఆ పంటను తీసుకెళ్లిన దళారి శివమణి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకుండా రేపు మాపంటూ తిప్పుకుంటున్నాడు. ఇటీవల కాలంలో తన తండ్రి కరోనా తో మరణించినప్పటికీ ఎంత ప్రాధేయపడ్డ దళారి శివమణి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడని వాపోయారు శుక్రవారం దళారి శివమణి సుజాతనగర్ లో తిరుగుతుండగా సంవత్సరం తెలుసుకున్న రైతులు ఆ ప్రాంతానికి హుటాహుటిన వచ్చి దళారి శివమణి పట్టుకొని చూస్తుండగానే రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి కట్టేసి నిరసన వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి పండించిన పంటను తీసుకెళ్లడమే కాకుండా మూడేళ్లుగా గడుస్తున్నప్పటికీ ఇంతవరకు చెల్లి గవ్వ కూడా వేయకుండా తప్పించుకు తిరుగుతున్న దళారిని తక్షణమే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తావా చస్తావా అంటూ హెచ్చరించారు. దీంతో సుజాతనగర్ ప్రధాన సెంటర్లో దళారుని విద్యుత్ స్తంభానికి కట్టేయడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. రైతును ఎలా మోసం చేయాలనిపించింది.. రైతుల ఉసురు తగలక మానదు అంటూ చూపరులు కూడా ఆ దళారిని తిడుతూ శాపనార్థాలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న సుజాతనగర్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ స్తంభానికి కట్టి వేయబడిన దళారి శివమణి విడిపించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రబుద్ధుడు ప్రతి ఏటా ఏదో ఒక ప్రాంతంలో ఇలాగనే మోసాలకు పాల్పడతారని అందరూ చర్చించుకోవడం విశేషం. పోలీసులు గానీ అధికారులు గానీ ఏ మేరకు దళారిపై చర్యలు తీసుకుని సంబంధిత బాధిత రైతులకు ఎలాంటి న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !