మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 10… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యల పై సంబంధిత మంత్రులను కలుస్తు వినతి పత్రాలు అందజేస్తూ సమస్య పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో పంట పొలాలకు విద్యుత్ సరఫరాపై తదితర సమస్యల పై మంత్రి జగదీష్ రెడ్డినీ శ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి త్వరలో సమస్యలు పరిష్కారిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మెచ్చా తెలిపారు.