UPDATES  

 కేటీపీఎస్ ప్రమాద ఘటనపై ఎంపీ నామ ఆరా

కేటీపీఎస్ ప్రమాద ఘటనపై ఎంపీ నామ ఆరా
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: నామ
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 11…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్ లో శనివారం జరిగిన ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఫోన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కేటీపీఎస్ కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని నామ అధికారులను కోరారు.కేటీపీఎస్ లో మెయింటినెన్స్ పనులు రిపేర్లు చేస్తుండగా ప్రమాదం జరిగి, ముగ్గురు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే.విషయం తెలియగానే నామ వెంటనే అధికారులతో పాటు స్థానిక పార్టీ నాయకులతో కూడా మాట్లాడి, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని, దగ్గరుండి , చికిత్సకు సహకరించాలని నామ కోరారు. క్షతగాత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీపీఎస్ అధికారులు నామకు వివరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !