మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 11… రోడ్డు ప్రమాణాలు ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. గొల్లగూడెం గ్రామం వైపు నుంచి సారపాక వైపు జామల్ కర్ర లోడుతో వస్తున్న ట్రాక్టరు ని కరకగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ లో విదులు నిర్వహిస్తున్న చర్ల మండలం సి కత్తిగూడెం గ్రామనికి చెందిన బుగ్గ రవి కరకగూడెం గ్రామనికి చెందిన బాదె సంతోష్ 22 సం,,యువకుడు ద్విచక్ర వాహనం పై వస్తూ ఎదురుగా వస్తున్న జామయిల్ ట్రాక్టరు ని బలంగా డికొని అక్కడికక్కడే మృతి చెందారు.మృతుడు బుగ్గ.రవి కి భార్య బాగ్యలక్ష్మి,ఎనిమిది సంవత్సరాల కూతురు వేణు ఉన్నారు.రొడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతులను చూసి కంటతడి పెట్టారు.మృతుల కుటుంబ సభ్యుల రోదనతో కరకగూడెంలో విషాద చాయాలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి ఎడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్ కరకగూడెం ఎస్ఐ జీవన్ రాజ్ సంఘటనలకు చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు తరలిస్తున్నట్లు సిఐ తెలిపారు.