UPDATES  

 అధికారుల జీవితాలతో ఆడుకోవటం కాంగ్రెస్ కు బాగా తెలుసు.

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి11:-  కాంగ్రెస్ పిసిసి చీప్ రేవంత్ రెడ్డి ఇల్లందు నియోజకవర్గ పర్యటనలో అధికారులను జైలుకు పంపిస్తానని, సింగరేణి సి అండ్ ఎండి శ్రీధర్ ను ఐఏఎస్ శ్రీలక్ష్మి తో పోల్చటం లాంటి విమర్శల నేపథ్యంలో ఇల్లందు జేకేఓసి ఫీట్ సెక్రెటరీ సంజీవరావు అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇల్లందు టీబిజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్ రంగనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారులను జైలుకు పంపించటం తప్పితే ఇంకా ఎం తెలియదని ఎద్దేవా చేసారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి నీ సింగరేణి సి అండ్ ఎండి శ్రీధర్ తో పోల్చటం సరైంది కాదన్నారు.కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి ఆమెను బలిపశువును చేసి ఆమె జైలుపాలు కావడానికి కాంగ్రెస్ పార్టీఏ కారణం అన్నారు. ఇవ్వాళ సింగరేణి దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ సింగరేణి సి&ఎండి శ్రీధర్  నేతృత్వంలో అందుకుందనీ, అనితర సాధ్యం అనుకున్న 67 మిలియన్ల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి నేడు 70 మిలియన్ల టార్గెట్ తో పరుగులు పెడుతుందన్నారు. వేలకోట్ల లాభాలు ఆర్జించి దేశానికి తలమానికంగా నవరత్నాల కు ఆదర్శంగా నిలిచిందన్నారు. కంపెనీ ఆర్థిక సహకారంతో కొల్బెల్ట్ ప్రాంతంలో అనేక అభివృధి అర్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యుత్ రంగంలో  1200 మేగావాట్ల జైపూర్ ప్రాజెక్ట్ అత్యధిక పిఎల్ఫీ తో 450 కోట్ల లాభాలు సాధించింది. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. సోలార్ విద్యుత్ 300 మెగావాట్ల లక్షాన్ని త్వరలో చేరుకోనున్నమన్నారు , ఐదువేల మందికి కొత్తగా ఉద్యోగాలు, 18000 మందికి డిపెండెంట్ , పీడిఎఫ్, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇప్పించుకున్నమన్నారు.సింగరేణి నీ  అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతున్న అధికారులను రేవంత్ రెడ్డి  జైలుకు పంపిస్తాం అని బెదిరించడం శోచనీయమన్నారు. ఆ పార్టీకి సహకరించిన పాపానీకి అధికారులను జైలు పాలు చేసిన  కాంగ్రెస్ పార్టీ వారికి ఇంతకన్నా మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఎద్దేవా చేసారు. మంచి అధికారులను తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా కాపాడుకుంటుదన్నారు.ఈ సమావేశంలో పిట్ కార్యదర్శి సంజీవరావు, షిఫ్ట్ ఇంచర్జీ రమేష్ బాబు, అఫీస్ ఇంచర్జి రాజయ్య, రవీంద్రబాబు, రాజ్కుమార్,కలువల వెంకటేశ్వర్లు, ఆనంద్, మాక్బల్, మహాబూబ్ అలి,  శ్రీనివాసులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !