మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 11 మండలంలోని నకిరిపేట పంచాయతీ పరిధిలో గల మడకం ముత్తయ్య (65)
మరణించిన విషయం తెలిసి శనివారం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రామ కొండ రెడ్డి దంపతులు వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఆర్థిక సహాయం రూ 4000 అందజేశారు. వారితో పాటు డిఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, ఉప అధ్యక్షులు బండారి లక్ష్మినారాయణ, గ్రామ పెద్దలు బొల్లా వెంకన్న, తాటి సారయ్య, తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు ఆర్పించారు.