పినపాక మండలంలో “దేశీ” శిక్షణ తరగతులు
పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన డీలర్లు
డ్రోన్ తో మందుల పిచికారీ విధానంపై శిక్షణ
శిక్షణ తరగతులు విజయవంతం : ఏ ఈ ఓ కొమరం లక్ష్మణరావు
మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 11..
పినపాక మండలం గొట్టెల్ల గ్రామంలో “దేశీ” శిక్షణ తరగతుల్లో భాగంగా వివిధ మండలాలకు చెందిన ఆరవ బ్యాచ్ డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించామని బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు తెలిపారు. శనివారం జిల్లాలోని వివిధ మండలాలనుండి వచ్చిన డీలర్లు మొదటగా ఈ . బయ్యారం గ్రామంలోని రైతులు గీద సంపత్, పోలిశెట్టి గణపతి రావు ల పొలాల్లో డ్రోన్ సహాయంతో మందుల పిచికారీ విధానాన్ని పరిశీలించారు. గొట్టెల్ల గ్రామంలో రైతు, పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. సెమీ ఆర్గానిక్ విధానంలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ బేర్,జామ,టమాటా తోటలను పరిశీలించి పంటల సాగు విధానం గురించి రైతు సుబ్బారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రైతు సుబ్బారెడ్డి తాను అనుసరిస్తున్న పంటల సాగు విధానాన్ని, సస్యరక్షణ చీడపీడల నివారణ చర్యలను గూర్చి డీలర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేశి ప్రోగ్రాం కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పడిగ నాగయ్య, వివిధ మండలాల డీలర్లు పాల్గొన్నారు.