మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 11.. మండలంలో వాహనాల యాజమాన్యం, రైతులతో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపతిరావు శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వాహనాల యజమాన్యం, రైతులు, వాహనాల పరిమితి నిబంధనల ప్రకారమే దినసరి కూలీలను, ప్రయాణికులను, ఏ ప్రమాద జరగకుండా సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయాలంటూ వాహనాల యజమాన్యాలకు తెలిపారు. మైనర్ డ్రైవర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే, తక్షణమే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, అన్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులు, రైతులు తమ వంతు బాధ్యతగా స్వీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరి ఉండాలని సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, వాజేడు మండలంలో వాహనాల యాజమాన్యులు, డ్రైవర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
