UPDATES  

 ఇందిరా గాంధీ పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోము… -కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి.

మన్యం న్యూస్, మణుగూరు/అశ్వాపురం, ఫిబ్రవరి11: ఇందిరా గాంధీ పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి అన్నారు. ఆయన శనివారం అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో మోడీ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని అభివృద్ధిని మేము ఏడు సంవత్సరాల లో చేశామని చెప్పారన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశ భౌగోళిక, మౌలిక , ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పటి పరిస్థితి ఏంటన్నారు. జాతీయ రహదారులు, విమానాశ్రయాలు ,రైల్వే స్టేషన్ లు ,విద్యాసంస్థలను, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది పేద ప్రజల కోసం పాటుపడింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. మారుమూల పల్లెలకు సహితం మౌలిక సదుపాయాలు కల్పించి విద్య ,వైద్యం ,రహదారి , సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. నీతి మాటలు చెప్పాలంటే అర్హత కూడా ఉండాలని, విభజించు పాలించు అనే నినాదంతో కులమత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి వారిచ్చిన హామీలను మర్చిపోయారన్నారు. భవిష్యత్తులో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బట్ట సత్యనారాయణ, బీసీ సెల్ అధ్యక్షుడు బచ్చురమణ ,తూము వీర రాఘవులు, మోషిన్, గుర్రం చెన్నయ్య ,నరసింహారావు ,కరుణ్, వీరయ్య ,మచ్చనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !