మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 11.. మండల పరిధిలోని బట్టుపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులలో విద్యార్థినిలతో వాటర్ పట్టించడం వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాస్.అఖిల్ శనివారం అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని మన ఊరు మన బడిలో భాగంగా జరుగుతున్న నిర్మాణాలపై దృష్టి సారించాలని నాశిరకమైన నిర్మాణాలు జరుగుతున్నట్లుగా కనబడుతున్నాయని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల పిల్లల చదువుకునే పాఠశాలలో పనులు చేపిస్తే ఉపాధ్యాయులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులే ఈ విధమైన పనులు చేపిస్తే ఎలా అని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చెన్నం రవి,పవన్ పాల్గొన్నారు.
