మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 12, అశ్వారావుపేట మండలం, ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల నాగేంద్ర, భార్గవి దంపతుల ఏకైక కుమార్తె లిఖిత పుట్టినరోజు రోజు వేడుకలు ఆదివారం చిలకలగండి ముత్యాలమ్మతల్లి ఆలయ సన్నిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో గతంలో అశ్వారావుపేట ఎస్ఐ గా విధులు నిర్వహించిన చల్లా అరుణ ముఖ్యఅతిధిగా హాజరయ్యి చిన్నారిని ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
