UPDATES  

 క్రీడాకారులను ప్రోత్సహించడంలోరేగా ముందుంటారూ నియోజకవర్గ నాయకులు గుండాల ఇంచార్జ్ భవాని శంకర్*

మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 12… క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముందుంటారని బీ ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గుండాల మండల ఇంచార్జ్ కోలేటి భవాని శంకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని 80 వాలీబాల్ జట్లకు బాలు తో పాటు నెట్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేగా పిడి నుండి వచ్చిన వ్యక్తి కనుక క్రీడాకారులు అంటే అమితమైన ప్రేమ ఉంటుందని అందుచేత క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని అన్నారు. ప్రతి సంవత్సరం రేగా విష్ణు ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో క్రీడలను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాలీబాల్స్ తో పాటు క్రికెట్ క్రీడాకారులకు సైతం త్వరలోనే క్రికెట్ బ్యాట్ వాళ్లను సైతం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద ఎత్తున యువతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న రేగా కాంతారావుకు యువకులంతా బాసటగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తి లింగయ్య, లింగగూడెం సర్పంచ్ జనగాం నరసింహారావు, యువజన విభాగమ అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బిసి సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, మైనార్టీ సెల్ అధ్యక్షులు సుభాని, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, అధికార ప్రతినిధి తిరుకొల్లూరి రాము, తాటి కృష్ణ , జాడి ప్రభాకర్, సుధాకర్, గాందేర్ల కిరణ్, కొమరం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !