మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి12: చల్లసముద్రం గ్రామపంచాయితీ పరిధిలోని ముకుందాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం జరగుతున్న శ్రీ జానకీ కోదండ రామాలయం నిర్మాణ శంకు స్థాపన కార్యక్రమం ఆదివారం రోజు ఘనంగా జరిగింది.కార్యక్రమానికి కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ధ్వజస్తంభం అందజేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ మెంబెర్స్, ప్రజలు, అయ్యగారు తదితరులు పాల్గొన్నారు.