UPDATES  

 ఎమ్మెల్యే మెచ్చాకు శివాలయ కల్యాణ మహోత్సవ ఆహ్వానం

మన్యం న్యూస్. ములకలపల్లి. ఫిబ్రవరీ 13…మండల కేంద్రం లొ ఉన్న శివాలయం లో ఈ నెల 17 నుంచి  19 తేదీ వరకు జరగనున్న కళ్యాణ జాతర మహోత్సవ కార్యక్రమానికి  రావాల్సిందిగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు కు, మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వరావులకు సోమవారం శివాలయం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమం లొ ఆలయ చైర్మెన్ నరాటి ప్రసాద్, పాలకవర్గ సభ్యులు పువ్వాల మంగపతి,డాక్టర్ కొమరయ్య, అమరనాథ్,శనగపాటీ సీతారాములు, పుష్పల చందరరావు, మోరంపూడి అప్పారావు, రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !