UPDATES  

 ఇళ్ల స్థలాల పోరాటాకి రేవంత రెడ్డి మద్దతు కోరిన పోరాట కమిటీ

 

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 13…మండలంలోని కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారికి ఇరువైపులా నివాసముంటున్న గోదావరి నది వరద బాధితులు సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యల పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. గత రెండువందల రోజులకు పైగా గోదావరి ముంపు బాధితులకు ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూములు కట్టించాలని, బూర్గంపాడు మండలం కృష్ణ సాగర్ పంచాయితీ పరిధిలో నిరవధిక నిరసన దీక్ష చేపట్టి ఆదివాసి, దళిత మహిళలు దీక్ష చేస్తున్నారు. నిరుపేదల ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డిని కోరారు. పార్లమెంట్ సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పేదల తరఫున ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అశ్వాపురం నుండి తన పాదయాత్ర ప్రారంభిస్తుండగా పోరాట కమిటీ నాయకులు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చన వారిలో పోరాట కమిటీ కార్యదర్శి పెద్దగోని ఆదిలక్ష్మి, చిడెం సంపత్, సున్నం భూలక్ష్మి, ఇరప మనోజ్, కుంజ మణి, గొగ్గల ఎర్రయ్యతో పాటు బాధితులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !