మన్యం న్యూస్ బూర్గంపహడ్ ఫిబ్రవరి 13… క్రీడలను ఈ మానసిక ఉల్లాసానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఆడి ఆటల్లో గెలుపోవటములను సహజంగా తీసుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించుకోవాలని సి నాగరాజు కోరారు .. సోమవారం మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాళ్లూరి భారతి గారి జ్ఞాపకార్థంగా ఈ నెల 9 నుంచి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ క్రమంలో ఇరవెండి గ్రామంలో సి.ఐ నాగరాజు ఆట ఆడి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం వారితో పాటు ఎస్సై లు పి.సంతోష్, రమణా రెడ్డి అదేవిధంగా సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, మండల సీనియర్ క్రీడాకారుడు మందా ప్రసాద్ క్రీకెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.