UPDATES  

 ఉమా సోమలింగేశ్వర స్వామి దేవాలయ నూతన చైర్మన్ గా కొదుమూరి.. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాములు నాయక్..

 

మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 14, మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో గల ఉమా సోమలింగేశ్వర స్వామి ఎండోమెంట్ దేవాలయం నూతన చైర్మన్ గా పాపకొల్లు గ్రామానికి చెందిన కొదుమూరి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. వారితోపాటు ఆరుగురు ఆలయ పాలకవర్గ సభ్యులను ఎంపిక చేశారు. వీరందరి చే వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ కి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ను నూతన పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎంపికైన ఆలయ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే రాములు నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జెడ్పిటిసి కళావతి, ఎంపీటీసీ స్వాతి, ఈవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !