మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 14…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17న మండల వ్యాప్తంగా మండలాల్లో నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు అధిక సంఖ్యలోపాల్గొని జయప్రదం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి తోకల రవి కోరారు. మంగళవారం 10వ తరగతి టాలెంట్ టెస్ట్ కరపత్రాన్ని మండల విద్యాశాఖ అధికారి ఎల్ రాజేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నామో ఈ టాలెంట్ టెస్ట్ కు అన్ని విద్యాసంస్థలు యజమాన్యం, ప్రిన్సిపల్, విద్యార్థులు అందరు సహకరించి జయప్రదం చేయాల్సిందిగా వారు సూచించారు.జిల్లా కార్యదర్శి టతోకల రవి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేయడమే కాదు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించే విధంగా రానున్న రోజుల్లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు ఈ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది అని వారు అన్నారు. ఇట్టి పరీక్షలో విద్యార్థులు విరివిగా ఇటువంటి సత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది గా సూచించారు. టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్దులకు
మంచి బహుమతులు అందించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు హేమంత్ సిద్దు ఉపాధ్యక్షులు యుగాంధర్ తదితరులు పాల్గొన్నారు