మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 14: భద్రాచలంలో టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హత్ సే హత్ జోడో యాత్ర జరగనున్న సందర్భంగా డిసిసి అధ్యక్షుడు పొదెం వీరయ్య,సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపు మేరకు అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వనమా గాంధీ,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మండల కాంగ్రెస్ బాధ్యులు జోడో యాత్రలో పాల్గొనటానికి భద్రాచలం భారీ సంఖ్యలో బయల్దేరారు.ఈ కార్యక్రమంలో చల్లా పుల్లయ్య,దోసపాటి రాంబాబు,ఇనుపనూరి జమలయ్య,కల్లోజీ నర్సింహా,విరబోయిన వెంకటేశ్వరావు,గోళ్ళ ముత్తయ్య,వేముల కోటేశ్వరావు,అహ్మథ్,అజిద్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.