మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 14 ఆదివాసులారా మేలుకొని 11 జాతులను ఎస్టి జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించారని దీనిపై ఆదివాసి యువత యువకులు దీనిపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు సుతారి. నాగేశ్వరరావు మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కులాలలో ఉండే వాల్మీకి,బోయ ఖైత లంబాడి మొదలగు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానించడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ తీర్మానాన్ని సమర్ధించిన ఎమ్మెల్యేలు దానిని వ్యతిరేకించాలని ఆయన కోరారు. అలాగే 1976లో లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదివాసులకు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయని జాతీయ రిజర్వేషన్ మీద ఎమ్మెల్యేల కొనసాగుతున్న వారు దీనిని కాపాడాలని ఆయన అన్నారు ఐదవ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఏజెన్సీ చట్టాలపై 1/59,1/70,పెసా1/77 చట్టాలను పగడబందిగా అమలు చేసి ఆదివాసీల అభివృద్ధి పాటుపడాలని డిమాండ్ చేశారు ఎస్టీ జాబితాలో కలిపే కైత లంబాడి
