మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 14: మండలంలోని కూనవరం గ్రామపంచాయతీ పరిధిలోని హెల్త్ సెంటర్లో మంగళవారం హెల్త్ మేళా ఆన్ సైకియోతోన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఉప సర్పంచ్ బాజీ, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఎం ఎల్ హెచ్ పి (ఎఫ్ ) వెంకటలక్ష్మి, ఏఎన్ఎం లక్ష్మీ, పగిడమ్మ, ఆశా కార్యకర్తలు నర్సులమ్మ, విజయ కుమారి, రమాదేవి, కృష్ణ కుమారి, జయలక్ష్మి, అంగన్వాడి టీచర్ వాడె విజయ్ కుమారి, ఆయా శశిరేఖ తదితరులు పాల్గొన్నారు.
