మన్యం న్యూస్, అశ్వరావుపేట ఫిబ్రవరి 14… అశ్వారావుపేట తహసిల్దారుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విల్సన్ మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. అలాగే గుర్రాలచెరువు గ్రామ ప్రజలు రేషన్ తీసుకోవడం కోసం అశ్వారావుపేట వెళ్లాల్సి వస్తుండటంతో గుర్రాలచెరువు లో రేషన్ అందించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.