UPDATES  

 అశ్వరావు పేట గ్రంధాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి, 14.. అశ్వారావుపేట పట్టణంలోని స్థానిక గ్రంథాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేంధర్, స్థానిక ఉద్యమకారుడు ముబారక్ బాబా తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ స్వరాష్ట్రం లో గ్రంధాలయాల పని తీరు చాలా మెరుగుపడింది, యువతకు అన్నీ విధాలా జ్ఞాన సముపార్జన కోసం అన్నీ గ్రంధాలయాలను అప్గ్రేడ్ చేసి డిజిటైలేజేషన్ దిశలో వాటిని తీర్చిదిత్తున్నట్లు రాజేందర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 గ్రంధాలయాల లో కొంచెం సిబ్బంది కొరత ఉన్నా అందుబాటులో ఉన్న సిబ్బంది తో సౌకర్యవంతంగా నడిపిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, పాఠకుల వీక్షణకు అన్నీ విధాలా సౌకర్యాలు కలుగజేస్తామని తెలిపారు. తాను చైర్మన్ ఐన దగ్గరనుండి జిల్లా గ్రంధాలయాన్ని ఆధునీకరణ చేసానని, నిరుద్యోగుల కోచింగ్ కు సంబంధిన సదుపాయాలను కూడా సమకూర్చానని దానితో పాఠకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, త్వరలో అశ్వారావుపేట గ్రంధాలయాన్ని కూడా అప్గ్రేడ్ చేసి పాఠకులకు అన్నీ సౌకర్యాలను కలుగజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కార్యదర్శి జుజ్జురి వెంకన్నబాబు, సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన రెడ్డి, పానుగంటి లక్ష్మణరావు, జుజ్జురి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !