మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి 14..
మండల పరిధిలోని గోపాలరావుపేట గ్రామంలో మంగళవారం జరిగిన క్రికెట్ పోటిల్లో పినపాక రెవిన్యూ అధికారుల టీం పై మణుగూరు స్ఫూర్తి ప్రెస్ క్లబ్ విజయం సాధించింది. పినపాక విద్యుత్ శాఖ అధికారులపై, పినపాక బిఆర్ ఎస్ నాయకులు విజయం సాధించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన స్ఫూర్తి ప్రెస్ క్లబ్ విలేఖరి నవీన్ కు పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ కావ్య బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల బిఆర్ఎస్ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రజలు పాల్గొన్నారు.