UPDATES  

 పొదుపుపై అవగాహనకు 2 కె రన్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 ప్రతి ఒక్కరూ పొదుపు సూత్రం పాటించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి సూచించారు. ఆర్బిఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2023లో భాగంగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 2 కె రన్ నిర్వహించారు. పాత కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ వరుకు 2 కె రన్ నిర్వహించారు. లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామపంచాయతీలు మున్సిపల్ ప్రాంతాల్లో ఈనెల 13 నుంచి 17 వరకు జిల్లాలోని అన్ని బ్యాంకులు ద్వారా ఆర్థిక అక్షరాస్యత శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యాంకు సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఆర్థిక సైబర్ నేరాలపై జాగ్రత్త వహించాలని, ఆర్థిక మోసాలకు గురైన వారు 1930,14448 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఆర్ఎం, వివిధ బ్యాంకు మేనేజర్స్స్, బ్యాంకు సిబ్బంది, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ నవీన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !