మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 15.. మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుంజ రంగయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు జాడి రామనాథం తనవంతుగా మృతుని కుటుంబానికి బుధవారం రూ .5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు లో రంగయ్య కుటుంబానికి తమ వంతంగా సహాయ, సహకారాలు అందిస్తామని హమి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇర్ప.విజయ్ కుమార్,మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,గుడ్ల.రంజిత్ కుమార సుతారి.నాగేశ్వరరావు,బట్టా.బిక్షపతి,జవ్వాజి.సమ్మయ్య,రామటెంకి పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
