మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 15 ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని బిజెపి మండల అధ్యక్షుడు సాయి శ్రీను బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు గల పేదలందరూ ఉపయోగించుకోవాల ఈ హెల్త్ కార్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేద,మధ్య తరగతి ప్రజలందరూ నమోదు చేసుకుని ఈ పథకం ద్వారా మెరుగైన వైద్యం పొందగలరని అన్నారు.