మన్యం న్యూస్ గుండాల.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న దృఢ సంకల్పంతో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజనం పాఠశాలలోనే లభించడంతో పిల్లలు మధ్యాహ్నవేళలో ఇంటికి వెళ్లకుండా చక్కగా భోజనాన్ని పాఠశాలలోనే చేస్తున్నారు. వీరికి వారానికి రెండు రోజులు కోడుగుడ్డుతోపాటు వివిధ రకాల కూరగాయలు పప్పుతో కడుపునిండా విద్యార్థులకు భోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులో ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం అంటే వర్కర్లదే కీలక పాత్ర వీరికి ప్రతి విద్యార్థికి కొంతమేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడంతో వారు విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారు. అలాంటి వారికి గతంలో 1000 రూపాయలు గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వం అందించేది వీరి శ్రమను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి గౌరవ వేతనాన్ని 3 వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందించడంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉండడంతో రాష్ట్రంలో గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా పెరిగింది గుండాల మండలంలో మధ్యాహ్నం భోజనం అందించే పాఠశాలలు మొత్తం 44 ఉండగా ఇందులో 52మంది మధ్యాహ్నం భోజనం వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈ పథకం ద్వారా మండలంలో మొత్తం 1420 మంది పిల్లలు లబ్ధి మధ్యాహ్న వర్కర్స్ కు ప్రభుత్వం గౌరవ వేతనాన్ని 3 వేల రూపాయలకు పెంచడంతో వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏండ్లుగా తక్కువ వేతరమైన పని చేస్తూ వస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవ వేతనం 3 వేలకు పెంచడం ఆనందంగా ఉందని మధ్యాహ్నం భోజనం వర్కర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రమను గుర్తించి వేతనాలు పెంచడం శుభ పరిమాణం
మొక్క సమ్మక్క గుండాల.
ఎన్నో ఏండ్లుగా తక్కువ వేతనంతో మధ్యాహ్నం భోజనం వండుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ మా శ్రమను గుర్తించి గౌరవ వేతనం పెంచడం ఆనందంగా ఉందన్నారు. మధ్యాహ్న భోజనం బిల్లులు కూడా సరైన సమయంలో చెల్లించినట్లయితే మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు