UPDATES  

 సేఫ్టీ మేనేజ్ మెంట్ ప్లాన్ వెలుగులో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి… -ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జేవి రమణ.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 15: సింగరేణి కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ (సీఎంఆర్ ) 2017 సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ వెలుగులో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మణుగూరు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జే వి రమణ అన్నారు. పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పీకే ఓసి 2 ఆవరణలో జరిగిన సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ కార్మికులకు రక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందా వుంటే దాని ఎలా నివారించాలి అనేది సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అని, వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించడం, దుర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించటం, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్కు దూరంగా ఉండటం, సీట్ బెల్ట్ ధరించడం, అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సరైన విశ్రాంతి ,అనుక్షణం పనిలో అప్రమత్తత మొత్తంగా రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడటం, ప్రమాద రహిత సింగరేణికై సింగరేణి యాజమాన్యం చేపడుతున్న చర్యలలో భాగస్వాములు కావటం ఇదే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఆయన కార్మికులకు అర్థమయ్యేలా వివరించారు. మనం నడిపే యంత్రాలను మనం కాపాడుకుంటూ ఉంటే అవి మనల్ని తప్పకుండా కాపాడతాయన్నారు. అనంతరం సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్టు మేనేజర్ మాలోత్ రాముడు, రక్షణ అధికారి శంకర్, సీనియర్ పిఓ ఎండి మదార్ సాహెబ్, అధికారులు భూక్య భాంగ్యా, నాగేంద్ర, బి బాబ్జి, కృష్ణమూర్తి, సూపర్ వైజర్ కోలా వెంకటేశ్వర్లు, సుకుమార్, గుర్తింపు సంఘం నాయకులు శంకర్, సేఫ్టీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !