మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కట్రం మోహనరావు అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామపంచాయతీలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన అనంతరం అన్ని శాఖల ఆధ్వర్యంలో వార్షిక అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందని సర్పంచ్ కట్రం మోహనరావు తెలిపారు. అనంతరం తెలంగాణ రైతు బంధు సమితి నూతన క్యాలెండర్ ను సర్పంచ్ కట్రం, వ్యవసాయ విస్తరణ అధికారి గోపికృష్ణ, కార్యదర్శి తిరుపతరావు లతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు బంధు సమన్వయ సమితి కన్వీనర్ సంఘం నాగరాజు, సభ్యులు బాదావత్ వెంకట్రాం, నాగ శ్రీనివాసరావు, దామెర్ల రాములు, ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
