మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 16 .. వార్తా ప్రపంచంలో అనునిత్యం కష్టపడుతూ అటు సమాజానికి ఇటు ప్రజలకు మధ్య వార్తలకు పనిచేస్తున్న పాత్రికేయులు క్రికెట్ క్రీడల్లో పవర్ చూపెట్టారు. అమితుని పోరాడి ఆధ్యాంతం చివరకు కప్పును గెలుచుకున్నారు. పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఐదు రోజుల నుంచి జరిగిన క్రికెట్ టోర్నమెంట్ తుది ఘట్టానికి చేరుకుంది గురువారం పినపాక ప్రెస్ క్లబ్, పినపాక మండల ఉపాధ్యాయుల మధ్య జరిగిన తుది పోరులో పినపాక ప్రెస్ క్లబ్ విజయం సాధించింది. పినపాక మండల ఉపాధ్యాయులు 12 ఓవర్లలో 69 పరుగులు చేయగా, పినపాక ప్రెస్ క్లబ్ ఎనిమిది ఓవర్లలోనే 70 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. మొదటి స్థానంలో పినపాక ప్రెస్ క్లబ్, రెండవ స్థానంలో ఉపాధ్యాయుల జట్టు, మూడవ స్థానంలో పినపాక మండల బిఆర్ఎస్ పార్టీ నిలిచాయి. ఈ సందర్భంగా టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, జయాపజయాలు సహజమని, ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి ఉండాలని, స్నేహపూర్వక వాతావరణం లో టోర్నమెంటు నిర్వహించిన ప్రెస్ క్లబ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ప్రెస్ క్లబ్ మిత్రులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
