UPDATES  

 పల్లి కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల కనుమరుగవుతున్న చేతివృత్తులు

 

మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం. ఫిబ్రవరి 16
రోజురోజుకు అంతరించిపోతున్న చేతివృత్తులు ఒకప్పుడు రాజ్యమేలాయి. ప్రతి ఒక్క వస్తువు చేతులతోనే తయారు చేసేవారు,అందువల్ల తయారైన ప్రతి వస్తువు గట్టిగా ధృడంగా ఉండేవి . కుమ్మరివాడు, దర్జీలు ,వడ్రంగులు,స్వర్ణకారులు ఇలా ప్రతి ఒక్కరు చేతులతో వస్తువులు ప్రత్యేక కళారూపాన్ని సంతరించుకునేవి. అలా తయారు చేయడం వల్ల వారికి ఏడాదంతా పని దొరికేది. రెడీమేడ్ వస్తువులు పల్లెలోకి అడుగుపెట్టిన తర్వాత , చేతివృత్తులు దీనస్థితికి చేరుకున్నాయి.
సాకలి వారు స్వర్ణకారులు ఎడ్ల బండ్లు నడిపేవారు.ఇలా మొదలు తదితర వాటికి. అందరికీ ఏళ్ల పాటు పని దొరికేది.పట్టణాల్లోంచి పల్లెటూర్లోకి ఎప్పుడైతే రెడీమేడ్ రంగం చొరబడిందో చేతివృత్తులు చతికిల పడ్డాయి.
పూర్వం మట్టితో కుండను తయారు చేసేవారు, ఆ కుండ గట్టిగాను దృఢంగా ఉండేది , ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ బిందెలు మట్టి కుండలను వెనక్కు నెట్టి వాటి మనుగడకే ఆటంకం తెచ్చాయి. అందువల్ల కుమ్మరివాడు తన చేతి వృత్తిని కాలగర్భంలో కలిపేలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ బెంచీలు రాకతో
వడ్రంగులు దిక్కుతోచని పరిస్థితిలో వడ్రంగి పనిని నమ్ముకున్న అన్ని కులాల వడ్రంగులు ఫర్నిచర్ పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్నారు. పట్నాలలో నానా అవస్థలు పడుతూ బి క్కుబిక్కుమంటు జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యం ఆసాములు , రైతులు, ఊరు జనాలతో కిటకిటి లాడే వారి వాకిలి పొక్కిలి అయ్యి రోధిస్తున్న వైనం కనబడుతుంది .
గతంలో అందరూ పండుగ అనగానే కొత్త బట్టలు దర్జీల దగ్గరికి వెళ్లి కుట్టించుకునేవారు. అలా చేతి మిషన్ల ద్వారా కుట్టిన దుస్తులు గట్టిగా దృఢంగాను ఉండేవి, దర్జీలకు పుష్కలంగా పని కూడా దొరికేది. కానీ రెడీమేడ్ బట్టలు వచ్చి కుట్టుమిషన్ల చప్పుడును కనుమరుగు చేశాయి. కొత్త కలర్లతో హంగులతో దర్జీల వృత్తిపై సమ్మెట దెబ్బలు కొట్టాయి.
భూమిలో భూమి మీద ఉన్న సహజ వనరులను కూడా వదలని కార్పోరేట్ కంపెనీలు
భూమి తనలో దాచుకున్న భూగర్భ ఖనిజాలను కార్పోరేట్ కంపెనీలు భూగర్భాను చీల్చి కొల్లగొట్టుకు పోతుంటే తన బలాన్ని కోల్పోయి తనలో ఉన్న సహజత్వాన్ని నెమరు వేసుకుంటూ ఎర్రలు పురుగులు చిన్న చిన్న జంతువులకు కూడా నిండా నీడని ఇయ్యలేని స్థితికి భూములు చేరుకున్నాయి.
బీర్లు విస్కీలు రమ్ములు తయారు చేసే కంపెనీల రాకతో
తాటికల్లు తీసే గౌడ్ అన్నలను దాదాపుగా కనుమరుగయ్యేలా చేశాయి. ఈ ప్రభావాలు గౌడ్ అన్నల పీకకు ఉరితాడై కూర్చున్నాయి.
ఇలా చాలా చేతివృత్తులు ఇంగ్లీష్ కంపెనీల ప్రభావంతో కనుమరుగవుతున్నాయి.
బంగారం తయారుచేసే స్వర్ణకారులు ఈ మధ్యకాలంలో పల్లెలో కనబడతలేరు, దీనికి ప్రధాన కారణం, బంగారం తయారుచేసే కంపెనీలు రావడం, అన్ని మిషనరీ తో తయారు చేయడం స్వర్ణకారుల చేతులు విరిగిపడేలా చేసి పనులు లేకుండా చేశాయి,.
గతంలో ఏ కార్యక్రమానికైనా తోలుతో తయారుచేసిన డప్పులు దర్శనమిచ్చేవి. ఇప్పుడు రేకు శబ్దంతో వచ్చిన ప్లాస్టిక్ డప్పులు, తోలు డప్పులను వెనక్కి నెట్టి వారి వృత్తులు వెనుకబడిపోయేలా చేశాయి.
ఇదివరకు ఇల్లు కట్టుకోవాలంటే ఎడ్లబండ్లను ఎక్కువ ఉపయోగించేవారు, ఎరువులు ఇసుక ఇటుక ప్రతి ఒక్కటి ఎడ్ల బండి ద్వారానే తెచ్చుకునేవారు. పల్లెలో పనులు చేస్తూ ఎంతో అందంగా ఎడ్ల పండ్లు కనబడుతుండేవి, ఎడ్లు కూడా మనుషులతో భాగంగా ఉండేవి. పల్లె పచ్చగా కళకళలాడుతూ నిస్వార్ధపు ప్రజలతో ఉండేది.
ట్రాక్టర్లు ఇతర వాహనాలు లారీలు వచ్చి ఎడ్ల దారికిని కమ్మివేసి, ఎడ్ల నాగళ్లకు సవాలు చేస్తూ నాగళ్ళు విరిగిపడేలా పల్లెలోక చోచ్చుకొని వచ్చాయి. ఎడ్ల బండ్ల నాగళ్ల వైభవాన్ని పల్లెటూర్లో దూరం చేశాయి.
పూర్వం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణ ఉండేది మందులు లేని పంట తిని అందరు ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు మన మనుగడకు సులభంగా చేసుకోవడానికి మనం తయారు చేసినవి మనకు ముప్పుగా మారే విధంగా కాలుష్యంతో బ్రతుకుతూ ఇంకా పల్లెలను పట్టణాలుగా అభివృద్ధిపరిచే క్రమంలో, కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలను పెంచుకుంటూ పోతూ చేతివృత్తలను దూరం పెడుతు పల్లెల అవునుత్యాన్ని పోగోడుతూ కన్నీళ్లు పెట్టుకునే తారా స్థితికి తీసుకొస్తున్నాము మళ్ళీ ఈ పల్లెలు పూర్వ వైభవం రావాలని ప్రతి చేతివృత్తిదారులు మిగిలిన ప్రజానీకం కోరుకుంటుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !