త్రాగు నీటికోసం …
ఐటీసీ సహకారం కోరిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
-కోటి రూపాయలు అంచనా
-సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం ఐ టి సి యాజమాన్యం
మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 17 మండలంలోని లక్ష్మీపురం
గ్రామపంచాయతీ పరిధిలో గల లక్ష్మీపురం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి వుడ్ యార్డ్ వరకు సుమారు కోటి రూపాయల వ్యయం తో గల డ్రైనేజీ నిర్మాణానికి, వుడ్ యార్డ్ లో గల ప్రజల త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నందు వలన తాగునీటి సమస్యను తీర్చాలని గురువారం జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత ఐటిసి యాజమాన్యాన్ని కోరారు
తక్షణ నీటి సమస్య పరిష్కారం కోసం వాటర్ ప్లాంటేషన్ (ఆర్వో ) నిర్మాణం చేపట్టేందుకు ఐటీసి యాజమాన్యం ఐటీసీ యూనిట్ హెడ్ మహంతి, హెచ్ ర్ హెడ్ శ్యామ్ కిరణ్, చీఫ్ మేనేజర్ చెంగల్ రావులను కలిసి కోరటం జరిగింది, సానుకూలంగా స్పందిస్తూ పై గ్రామాలలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటిసి యాజమాన్యం తెలిపారు.