- భారీగా గంజాయిని పట్టుకున్న ఆళ్లపల్లి పోలీసులు
- రూ.60 లక్షలు విలువగల మూడు క్వింటాల గంజాయి స్వాధీనం ఒకరు అరెస్ట్* ఇల్లందు డిఎస్పి రమణమూర్తి
మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 17
ఆళ్లపల్లి మండలంలో భారీగా గంజాయిని ఆళ్లపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. రూ.60 లక్షల విలువ చేసే మూడు క్వింటాల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లందు డిఎస్పి రమణమూర్తి పేర్కొన్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న గంజాయి ని ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు వెంబడించడంతో పాల్వంచ, రేగళ్ల, గట్టు మల్ల రహదారి గుండా ఆళ్లపల్లి మండలంలోకి నిందితులు ప్రవేశించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఆళ్లపల్లి పోలీసులు ఎంతో చాకచక్యంతో టీఎస్ 22 డిఆర్ 5953 మహేంద్ర వాహనంలో హైదరాబాద్ వాసి సుమన్, నల్గొండ వాసి భరత్ లు గంజాయి తరలిస్తుండగా పెట్టి పోలీసులు వెంబడించగా ఒకరు పరారు కాగా మరొకరిని పట్టుకున్నట్లు డిఎస్పి రమణమూర్తి పేర్కొన్నారు. 20 రోజుల లోపే ఆళ్లపల్లి మండలంలో గంజాయి నిందితులను ఆళ్లపల్లి పోలీసులు ఎంతో చాకచక్యంగా అరెస్టు చేశారని ఇల్లందు డిఎస్పి పేర్కొన్నారు. ఈ వేటలో పాల్గొని నిందితులను అరెస్టు చేసిన సిబ్బందిని అభినందించారు .ఈ కార్యక్రమంలో టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి, ఆళ్లపల్లి ఎస్సైలు రతీష్ , అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు .
