కరెంట్ కోతలు నివారించాలని ఎన్డి అధ్వర్యంలో ప్రదర్శన
మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి17:- రైతులు సాగుచేస్తున్న పంటకు కావల్సినంత విద్యుత్ ను కోతలు లేకుండా ఇవ్వాలని శుక్రవారం రోజు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ అధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.కరెంట్ ఆఫీస్ లో శాఖ అధికారి ఏడీ కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఎల్ పార్టీ నేత మధు మాట్లాడుతూ.. రైతుకు అందించాల్సిన స్థాయిలో విద్యుత్ సరఫరా అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైపల్యం చెందిందన్నారు.రోజుకు రెండు మూడు గంటలకు మించి త్రీ పేస్ విద్యుత్తు సరఫరా ఇవ్వకపోవడం వలన జిల్లా వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని, కొన్ని ప్రాంతాలలో అర్థరాత్రి కరెంటు ఇవ్వడంతో రైతన్న నిద్ర గారాలు లేకుండా సతమతమవుతున్నారాన్నారు.
చీకట్లో పాము కాటు లాంటి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఓవర్ లోడ్ విద్యుత్ తో మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్ ఫార్మర్ల కాలిపోతే 48 గంటల్లో రిపేరు చేయాలని ఆదేశాలున్నాప్పటికి, ప్రభుత్వం,అధికారుల శ్రద్ధ కరువైందని ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
దేశాని రోల్ మోడల్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం-24 గంటలు కరెంటు ఉచితంగా,నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం, ఈ వచ్చి పోయే కరెంటుకు రైతులకు ఏం సమాధానం చెబుతుందని, ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో
న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కొక్కు సారంగపాణి,సర్పంచులు
మోకాళ్ళ కృష్ణ,శ్రీను,పూనెం కోటయ్య,బోయి శ్రీను,రామ చందర్,చింత ఎర్రయ్య, ధనంజేయ,తారాచంద్, వాంకుడోత్ మోతిలాల్, బొర్రభిక్షం,గుగ్గిల రాజు, పూణేం రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.