UPDATES  

 మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి… – ఏరియా జీఎం రామచందర్ కు మైనింగ్ స్టాప్ వినతి.

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 17:
మైనింగ్ సర్దార్ కు ఇచ్చిన డిస్మిస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలనీ కోరుతూ ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాం చందర్ కి శుక్రవారం మైనింగ్ స్టాప్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
భూపాలపల్లి కెటికెఓసీపి 3 గనిలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ముగ్గురు మైనింగ్ సూపర్ వైజర్ లను బాధ్యులను చేస్తూ అందులో ప్రకాష్ అనే సూపర్ వైజర్ ను సింగరేణి యజమాన్యం క్రమశిక్షణ చర్యల పేరుతో ఉద్యోగం నుంచి తొలగించడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ లో జరిగిన అతి పెద్ద ప్రమాదాల్లో గతంలో కార్మికుల ప్రాణాలు కోల్పోయినప్పటికీ యాజమాన్యం ఇలాంటి చర్యలు ఎప్పుడు చేపట్టలేదన్నారు. సింగరేణి ఉత్పత్తి సాధనకు మైనింగ్ సిబ్బంది తమ ప్రాణాలను, మైనింగ్ సర్టిఫికెట్ ను ఫణంగా పెట్టి పని చేస్తున్నారని, యాజమాన్యం వారి సేవలు వాడుకుంటూ గనులలో జరిగే ప్రమాదాలకు కేవలం మైనింగ్ సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేసి క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడం అత్యంత విచారకరమన్నారు. వారి పై చర్యలు తీసుకోవడం వల్ల మైనింగ్ సిబ్బందే కాకుండా వారి కుటుంబం కూడా మానసికంగా కృంగి పోతారని సింగరేణి యాజమాన్యం తీసుకున్న క్రమ శిక్షణ చర్యలు వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు బిక్కసాని రవి, అభిలాష్, ఉపేందర్, సుబ్బరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !