మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 17.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత 2023 వారోత్సవాల్లో భాగంగా వికెడివిఎస్ డిగ్రీ కళాశాల యందు విద్యార్థులకు సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ వి అంజిబాబు, డి చంటిలు శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా పిఎంఎస్ఎస్బివై, పీఎంజెజెవై, ఇన్సూరెన్స్ లు చేయించుకోవాలని కోరారు. డిజిటల్ బ్యాంకింగ్, రూపే కార్డులు ఉపయోగాలు తెలుసుకోవాలని, ఆర్థిక సైబర్ నేరగాల్ పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. ఇతరులకి ఓటీపీలు ఆధార్ కార్డు నెంబర్ చెప్పరాదని విద్యార్థులు ఈ విషయాలపై అవగాహన పెంచుకొని పలువురి పెద్దలకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సేవింగ్ చేయడం ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వి కే డి వి ఎస్ కళాశాల ప్రిన్సిపల్ శేషుబాబు, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.