మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 17 బీఆర్ఎస్ పార్టీతోనే దేశ ప్రగతి సాధ్యమని పార్టీ మండల అధ్యక్షులు ఖాయం నరసింహారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ డోర్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గాన్ని ప్రభుత్వా విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రగతి పదములు నిలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గానికి ఎన్నడూ లేనివిధంగా నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో రేగా సారధ్యంలో పార్టీ దృశకపోవడం పద్యం అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, సర్పంచ్ ప్రేమ కల, నరసింహారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, పార్టీ నాయకులు ఆదాం, గౌరబోయిన సుబ్బారావు, ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు
